హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జానాతో సమావేశం: తెలంగాణ నేతలపై బాబు గుర్రు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మంత్రి జానారెడ్డితో భేటీ అయ్యారని చంద్రబాబు సీనియర్ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నరసింహులు సహా పలువురిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. తాను కేవలం లేఖ రాయటం వరకే అనుమతి ఇచ్చానని జానారెడ్డిని కలవడానికి అనుమతి ఇవ్వడం లేదని వారిపై అగ్రహం వ్యక్తం చేశారట.

బాబు ఆగ్రహంతో తగ్గిన తమ్ముళ్లు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. అయితే తాము లేఖ మాత్రమే కాకుండా జానారెడ్డిని కలవడానికి కూడా అధినేత నుండి అనుమతి తీసుకున్నామని వారు బయటకు చెబుతున్నారట. మంగళవారం ఉదయం ఎర్రబెల్లి, మోత్కుపల్లి ఆధ్వర్యంలో పలువురు టిటిడిపి నేతలు జానారెడ్డిని కలిసి తెలంగాణ అంశంపై చర్చించిన విషయం తెలిసిందే. కాగా గతంలోనూ చంద్రబాబునాయుడు పలుమార్లు టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

English summary
The rumors were came out that Telugudesam Party president Chandrababu Naidu fired at Telangana Telugudesam Party leaders for met minister Jana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X