హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసును వీడటానికి జానారెడ్డి సిద్ధం: ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి జానారెడ్డి పార్టీని వదలడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు మంగళవారం అన్నారు. తెలంగాణ విషయమై జానారెడ్డితో సమావేశం ఐన అనంతరం టిడిపి నేతలు మీడియాతో మాట్లాడారు. పార్టీ వదలి రావడానికి జానారెడ్డి సిద్ధమని చెప్పడం వల్లే విధులకు హాజరు కావడంపై అడగలేదన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు ముందుకు వస్తే మూకుమ్మడి రాజీనామాలకు టిడిపి సైతం సిద్ధంగా ఉందన్నారు. అందరం పార్టీలకతీతంగా, జెండాలు వదలి ఒకే గుర్తుపై పోటీ చేయడానికి సిద్ధం కావాలన్నారు.

మూకుమ్మడి రాజీనామాలతోనే తెలంగాణ సాధ్యమని చెప్పారు. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని జానారెడ్డిని కోరినట్లు చెప్పారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ప్రజాప్రతినిధులను అవమానపర్చేలా మాట్లాడటం మానుకోవాలన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులను ఆగౌరవపరిచేలా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతామని, ప్రివిలేజ్ మోషన్ పెట్టి సభకు రప్పిస్తామని హెచ్చరించారు. అన్నాహజారేను చూసి కోదండరామ్ నేర్చుకోవాలని సూచించారు.

English summary
Telugudesam party senior mlas Errabelli Dayakar Rao and Mothkupalli Narasimhulu said that Minister Jana Reddy is ready to leave Congress for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X