హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ తెలుగుదేశం నేతలపై కోదండరామ్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: కేసులు పెడతానని బెదిరించే వారు ప్రజాప్రతినిధులు కారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం అన్నారు. ప్రజాప్రతినిధులను కోదండరామ్ అవమానిస్తున్నరాని, అందుకు క్షమాపణలు చెప్పాలన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. తాము పౌరులుగా తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నామన్నారు. మాపై కేసులు పెడతామని బెదిరిస్తున్న వారు ప్రజాప్రతినిధులు కారన్నారు. తాను అన్న వ్యాఖ్యలు కేవలం తెలంగాణ ద్రోహులకే వర్తిస్తాయన్నారు.

తెలంగాణ కోసం ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలు చేస్తే స్వాగతిస్తామన్నారు. జెండాలు, పార్టీని పక్కన పెట్టి ఒకే గుర్తుపై పోటీకి సిద్ధమన్న టిటిడిపి వ్యాఖ్యలను కూడా ఆయన స్వాగతించారు. సకల జనుల సమ్మెపై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. సకల జనుల సమ్మె కొనసాగుతుందన్నారు.

English summary
Telangana JAC chairman Kodandaram condemned Telangana Telugudesam Party comments today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X