ఈనాడు, బొత్సలపై మండిపడిన వైయస్సార్ కాంగ్రెసు
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను తగ్గించాలని చూస్తే వందరెట్ల రెట్టింపుతో వెలుగొందుతారన్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైఎస్ఆర్ తీపి గుర్తులను చెరిపివేయటం ఎవరి తరం కాదని భూమన అన్నారు. శుక్రవారం వైఎస్ ద్వితీయ వర్థంతి సందర్భంగా అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
వైఎస్ వర్థంతి వేడుకలు జరపాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదేశాలివ్వటంపై అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ వర్థంతి వేడుకలను నిర్వహించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన గురువారం అనంతపురంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ వర్థంతిని ఏ హక్కుతో జరుపుతారని ప్రశ్నించారు. స్పీకర్ ఫార్మెట్లోని తాము రాజీనామాలు చేశామని, కాంగ్రెస్ పెద్దలకు దమ్ముంటే తమ రాజీనామాలు ఆమోదించేలా ఒత్తిడి తీసుకురావాలని గుర్నాథరెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ పెద్దలకు సీఎం కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స ఊడిగం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతలకు వైఎస్ఆర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జలీల్ఖాన్ అన్నారు. కాంగ్రెస్ నాయకులంతా పవర్ పాలిటిక్స్కే గానీ, ఎప్పటికీ ప్రజల నాయకులు కాలేరని ఆయన గురువారం విజయవాడలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.