వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ పార్లమెంటు సభ్యులపై చంద్రబాబు సీరియస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: పార్టీ పార్లమెంటు సభ్యుల తీరుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారిపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆదివారంనాడు ఆయన పార్లమెంటు సభ్యులతో సమావేశమై పార్లమెంటు సమావేశంలో వారి పనితీరుపై చర్చించారు. అవినీతిపై, క్రాప్ హాలీడేపై పార్టీ పార్లమెంటు సభ్యులు సమావేశాల్లో తగిన విధంగా వ్యవహరించలేదని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. అవినీతిని, క్రాప్‌ హాలీడేను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చడానికి వీలైన విధంగా పార్లమెంటులో లేవనెత్తలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా తాను పర్యనటలు చేస్తూ, విద్యార్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ తీవ్రంగా శ్రమిస్తుంటే ఆ విషయాన్ని పార్లమెంటు సభ్యులు పార్లమెంటు దృష్టికి తేవడంలో విఫలమయ్యారని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే, కోస్తా జిల్లాల్లో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించడం వల్ల తలెత్తిన సమస్యను పార్లమెంటు సమావేశాల్లో చర్చనీయాంశంగా మార్చడంలో కూడా సభ్యులు ఫలితం సాధించలేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

English summary
It is said that TDP president N Chandrababu Naidu has expressed displeasure over the party MPs performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X