వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి ఇంట్లో రూ. 3కోట్లు, 30 కిలోల బంగారం గుర్తింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బళ్లారి‌: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు మూడు కోట్ల రూపాయల నగదును, 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన పారిజాత ఆపార్టుమెంటులో సిబిఐ అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున సోదాలు ప్రారంభించిన సిబిఐ అధికారులు ఉదయం ఆరున్నర గంటలకు గాలి జనార్దన్ రెడ్డిని, ఒఎంసి డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేశారు. శ్రీనివాస రెడ్డి ఇంట్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ వారు కోటిన్నర రూపాయల నగదును గుర్తించారు.

గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. జనార్దన్ రెడ్డిని నివాసంలోని ప్రత్యేక గది తాళం పగులగొట్టి సోదాలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు నాలుగు పుస్తకాలు, ల్యాప్‌ట్యాప్, డైరీ స్వాధీనం చేసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి హెలికాప్టర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు శ్రీరాములు నివాసాల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో మరింత మందిని సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరిలో అధికారులు కూడా ఉండవచ్చునని చెబుతున్నారు.

English summary
CBI recovered Rs 3 crores cash and 30kgs gold from Gali Janardhan Reddy's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X