అరెస్టుకు ముందు రెండు కోట్ల బంగారు కుర్చీలో గాలి
గాలి జనార్దన్ రెడ్డి తండ్రి చెంగారెడ్డి ఓ కానిస్టేబుల్. కడప జిల్లాకు చెందిన గాలి సోదరులు బళ్లారిలో స్థిరపడ్డారు. అక్కడ ఓ ఫైనాన్స్ సంస్థను నడిపారు. దాని వల్ల 1995లో ఫైనాన్స్ కంపెనీ 200 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. 2004లో మొదటిసారి ఇనుప ఖనిజం తవ్వకాల లీజును గాలి సోదరులు పొందారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అది జరిగిందని అంటారు. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆస్తుల విలువ 115 కోట్ల రూపాయలు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఇనుప ఖనిజాలను లీజుకు తీసుకున్న తర్వాత అక్రమ తవ్వకాలు మితిమీరిపోయాయనే ఆరోపణలు వచ్చాయి.
గాలి జనార్దన్ రెడ్డి 2009లో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి 42 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రపు కిరీటాన్ని ప్రదానం చేశారు. అదే ఏడాిది గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెబుతారు. ఈ పెళ్లికి పది వేల మందికి పైగా అతిథులు హాజరయ్యారు. గాలి సోదరులు అక్రమ మైనింగ్ ద్వారా 215 కోట్ల రూపాయలు ఆర్జించారని కర్ణాటక లోకాయుక్త తప్పు పట్టింది.