వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యానిదే ఎప్పటికీ విజయం: గాలి జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్‌: ఎప్పటికైనా సత్యమే విజయం సాధిస్తుందని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఏనాడూ తాను అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. తమ కార్యాలయం నుంచి హైదరాబాదులోని నాంపల్లి ప్రత్యేక కోర్టుకు సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని, ఒఎంసి డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని సోమవారం సాయంత్రం తరలించారు. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డితో మీడియా ప్రతినిధులు మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఆ విధంగా అన్నారు. సిబిఐ అధికారులు మీడియాతో మాట్లడడానికి గాలి జనార్దన్ రెడ్డిని అనుమతించలేదు.

కాగా, బళ్లారి నుంచి మధ్యాహ్నం తీసుకువచ్చిన గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని సాయంత్రం సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. మీడియా కంట పడకుండా తమ కార్యాలయం వెనక గేటు నుంచి వారిద్దరిని నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బెయిల్ కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

English summary
Karnataka former minister Gali Janardhan Reddy said that truth will win ultimately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X