వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఇచ్చిన నోట్‌ను చదవలేదు: ఫరూఖ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Farooq Abdullah
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు ఇచ్చిన మెమొంరాండాన్ని ఇంకా తను చదవలేదని కేంద్ర మంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. వైయస్ జగన్ మంగళవారం ఉదయం ఫరూఖ్ అబ్దుల్లాను కలిశారు. ఈ భేటీ తర్వాత ఫరూఖ్ అబ్దుల్లా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగన్ ఇచ్చిన మెమొరాండంలో చాలా పేజీలు ఉన్నాయని, తాను ఇంకా చదవాల్సి ఉందని ఆయన అన్నారు. వేధింపులపై సమాధానం చెప్పాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.

సిబిఐ దాడుల గురించి జగన్ తనకు చెప్పలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తనను ఎలా వేధిస్తోందనే విషయంపై జగన్ తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. జగన్ ఇచ్చిన మెమొరాండం చదివిన తర్వాత ఏమైనా మాట్లాడుతానని ఆయన అన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వ్యినియోగం జరుగుతోందనే విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను శంకించలేమని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన విసుగు చెందినట్లు కనిపించారు.

English summary
Union Minister and National conference leader Farooq Abdullah said that he has to read YS Jagan's note.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X