వైయస్ జగన్ను ఎ-1కు తీసుకు వచ్చారు: పిల్లి
తాము ఎమ్మెల్యే పదవులతో పాటు పార్టీ సభ్యత్వాలకు సైతం రాజీనామా చేశామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పాల్పడిన వైయస్ పేరును కక్ష పూరితంగానే ఎఫ్ఐఆర్లో నమోదు చేశారన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం దాఖలు చేయలేదని దీనిని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వారిని అణిచి వేయడానికి సిబిఐని ఉపయోగించుకుంటుందన్నారు. ఇది ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదం అన్నారు.
సిబిఐ పనితీరుపై చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ వద్దకు వచ్చారన్నారు. మిగిలిన నలుగురు వ్యక్తిగత కారణాల వల్ల రాలేదన్నారు. కొందరు తమపై అవినీతికి మద్దతుగా రాజీనామాలు చేశారని ఆరోపణలు చేస్తున్నారని అలా అయితే అందరూ రాజీనామాలు చేసి ప్రజా కోర్టుకు రావాలని మరో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మా రాజీనామాలు ఆమోదించాలని గవర్నర్ను కోరామని చెప్పారు.