హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యాపారి కిడ్నాప్: కొట్టుకుంటూ తీసుకెళ్లిన దుండగులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధానిలో మరోసారి కిడ్నాప్ కలకలం చెలరేగింది. తార్నాక పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఓ వ్యాపారి కిడ్నాప్‌కు గురయ్యాడు. హబ్సిగూడలో పిఆర్ఎస్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డిని కొందరు దుండగులు ఉదయం కిడ్నాప్ చేశారు. సుమారు పది మంది దుండగులు రెండు ఇండికా కార్లలో వచ్చి పిఆర్ఎస్ మార్కెటింగ్ కార్యాలయంలోనికి వెళ్లారు. శ్రీధర్ రెడ్డిని కొట్టుకుంటూ ఇండికా కారులో ఎక్కించుకొని తీసుకు వెళ్లారు. అడ్డు వచ్చిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డి కిడ్నాప్‌కు గురి కావడంతో కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు తార్నాక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చుట్టుపక్కల చెక్ పోస్టులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వ్యాపారంలో గొడవలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత శతృత్వం తదితర కోణాలలో పోలీసులు దృష్టి సారిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి కుటుంబం నాచారంలో నివాసం ఉంటోంది. అయితే నేరుగా కార్యాలయంలోకి వచ్చి కొట్టుకుంటూ తీసుకు వెళ్లడం వంటి కారణాల వల్ల శ్రీధర్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే వారే కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
A business man kidnapped in Hubsiguda of Hyderabad today. PRS marketing MD Sridhar Reddy kidnapped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X