హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పాపం పండింది కాబట్టే..: జెసి దివాకర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాపం పండింది కాబట్టే అక్రమాలు బయట పడుతున్నాయని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి గురువారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ అక్రమాలతో భారీగా డబ్బులు కూడబెట్టారన్నారు. అవినీతితో కూడబెట్టిన డబ్బును తన కొడుక్కు ఇచ్చి వైయస్ వెళ్లి పోయారన్నారు. వైయస్ పథకాల పేరుతో ఎన్నో తప్పులు చేశారన్నారు. అక్రమంగా వచ్చిన డబ్బుతోనే జగన్ పార్టీ పెట్టారన్నారు.

కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పడం జగన్‌కు కళంకం తెచ్చిందని ఏడుసూత్రాల కమిటీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి వేరుగా అన్నారు. సిబిఐ దర్యాఫ్తుకు జగన్ సహకరించి తన నిజాయితిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అక్రమాలు చేయకుంటే ఢిల్లీ వెళ్లి అందరి గుమ్మాలు తొక్కడం ఎందుకన్నారు.

English summary
Anantapur senior Congress MLA JC Diwakar Reddy said today that YSRC Party president YS Jaganmohan Reddy corruption is coming now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X