వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుళ్లకూ జగన్, గాలి లంచాలిచ్చినట్లున్నారు: వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veera Siva Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి దేవుళ్లకు సైతం లంచాలు ఇచ్చినట్టున్నారని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు వీర శివా రెడ్డి గురువారం విమర్శించారు. జగన్, గాలి ఇద్దరూ దేవుళ్లను కూడా వదలకుండా లంచాలు ఇచ్చినందునే తమకు దేవుడు ఉన్నాడని, మంచి వారిని దేవుడే చూసుకుంటాడనే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, తిరుపతి పుణ్యక్షేత్రాలకు గాలి జనార్ధన్ రెడ్డి ఇచ్చిన కానుకలు తిరస్కరించాలన్నారు. అవినీతి, అక్రమాలు చేసి పాపాలకు పాల్పడిన వారు అంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెసు ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు సూచించారు. జగన్ ఏ తప్పు చేయనప్పుడు న్యూఢిల్లీ వెళ్లి గల్లీలలో జాతీయ నేతల చుట్టూ తిరగాల్సిన ఖర్మ ఎందుకని ప్రశ్నించారు. జగన్ దుర్మార్గాలకు కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ సిబిఐ దర్యాఫ్తుకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Congress senior mla Veera Siva Reddy blamed YSRC Party president YS Jaganmohan Reddy and BJP senior mla Gali Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X