వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షుద్రపూజలకు ఐదేళ్ల చిన్నారి దారుణ బలి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజలకు ఓ చిన్నారి బలైంది. నెల్లూరు జిల్లా సోమయ్యపాలెం గ్రామంలో ఐదేళ్ల చిన్నారి నందిని దారుణ హత్యకు గురైంది. క్షుద్రపూజలకు చిన్నారిని బలి ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. స్మశానవాటికలో బాలిక శరీరభాగాలు పడి ఉన్నాయి. చిన్నారి రెండు చేతులను నరికేశారు. కళ్లు పీకేశారు.

నందిని ఐదేళ్ల క్రితం అదృశ్యమైంది. తల్లిదండ్రులు వెంకటయ్య, పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని గాలిస్తున్న క్రమంలోనే ఆ దారుణం జరిగింది. కుటుంబంతో ఎవరికైనా కక్షలున్నాయా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, అదేమీ లేదని తేలింది. గ్రామస్థులు బాలిక శవాన్ని స్మశానవాటికలో చూసి తెలిపారు. సోమయ్యపాలెం గ్రామం కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే బాలికను క్షుద్రపూజలకు బలిచ్చారని అనుమానిస్తున్నారు.

English summary
It is suspecting that a five year old grls was sacrificed for black magic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X