వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్: పదేళ్ల కారాగారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Delhi Map
న్యూఢిల్లీ: పందొమ్మిదేళ్ల వయసు గల అమ్మాయిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డందుకు ముగ్గురు యువకులకు ఢిల్లీ జిల్లా కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిసార్(20), సన్నీ(22), ముఖేష్(20) అనే ముగ్గురు యువకులకు ఢిల్లీ జిల్లా జడ్జి పిఎస్ తేజి ఈ శిక్ష విధించారు. పని కోసం వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న అమ్మాయిపై వీరు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. వీరికి కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేల రూపాయల జరిమానా కోర్టు విధించింది.

ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 25, 2009లో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అక్టోబర్ 24, 2009 రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను పని చేసే చోటు నుండి కల్యాణ్ పురిలోని తన ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెకు తెలిసిన ముగ్గురు ఎదురయ్యారు. ఆమెను బెదిరించి ఓ చోటుకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. విచారణ సమయంలో తమపై అభియోగాలు సరియైనవి కావని నిందితులు చెప్పారు. అయితే జడ్జి వారి మాటలను పరిగణలోకి తీసుకోలేదు. ఏ భారత స్త్రీ ఇలాంటి ఆరోపణలు వట్టినే చేయదన్నారు.

English summary
Three youths have been sentenced to ten years rigorous imprisonment by a Delhi court for gangraping a 19-year-old girl at knife point.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X