హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా సురేఖ, సత్యవతి రాజీనామా, జయసుధ టోకరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayasudha-Konda Surekha
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు కొండా సురేఖ, కుంజా సత్యవతి మంగళవారం మధ్యాహ్నం తమ పదవులకు రాజీనామా చేశారు. మొదట గన్ పార్కు వద్దకు చేరుకొని తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అటు నుండి నేరుగా పాదయాత్రతో అసెంబ్లీకి చేరుకున్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ లేక పోవడంతో అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు తమ రాజీనామాలు సమర్పించారు. వారు సమర్పించిన రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. జయసుధ రాకపోవడంపై ప్రశ్నించగా ఆమె తల్లికి ఆరోగ్యం బాగా లేనందున రాలేదని వారు చెప్పారు.

కాగా సకల జనుల సమ్మెకు మద్దతుగా జగన్ వర్గం తెలంగాణ ప్రజా ప్రతినిధులు జయసుధ, కొండా సురేఖ, కుంజా సత్యవతి రాజీనామాలు చేస్తారన్న వాదనలు వినవచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం మాత్రం జయసుధ తాను ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పిన విషయం తెలిసిందే. రాజీనామాల వ్యవహారం ఓ డ్రామాలాగ కనిపిస్తోందని, రాజీనామాలు ఆమోదిస్తారనే విశ్వాసం ఏర్పడినప్పుడే చేస్తానని చెప్పారు. రాజీనామాపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తాను అందరిలాంటి రాజకీయ నాయకురాలిని కాదని చెప్పారు. కాగా గతంలో తెలంగాణ కోసం మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు వీరు కూడా రాజీనామా చేశారు. అయితే వాటిని స్పీకర్ మూకుమ్మడిగా తిరస్కరించిన విషయం తెలిసిందే.

English summary
YSRC Party president YS Jaganmohan Reddy camp Telangana MLAs Konda Surekha and Kunja Satyavathi were resigned for their post. Secunderabad MLA Jayasudha is not interested for resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X