వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్‌పై పోటీకి అమరవీరుల ఐక్యవేదిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nizamabad
వరంగల్: తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై పోటీ చేయడానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పోటీ చేయడానికి తర్జన భర్జన పడుతున్న విషయం తెలిసిందే. అయితే టిఆర్ఎస్ పైన పోటీ చేయడానికి తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక గురువారం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబానికి చెందిన కట్కూరు వాసి రమేష్‌ను పోటీకి దించాలని ఐక్య వేదిక నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

రమేష్‌ను అమరవీరుల ఐక్య వేదిక అభ్యర్థిగా త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమ తీవ్రతను గమనించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాన్సువాడ పోటీ చేసే అంశాన్ని తెలంగాణ నేతలకే అప్పగించారు. ఇక కాంగ్రెసు అధిష్టానం మాత్రం పోటీకి సిద్ధమంటోంది. అయితే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు మాత్రం పార్టీ తరఫున పోటీకి దించవద్దని అధిష్టానాన్ని కోరుతోంది.

English summary
It seems, Amaraveerula Aikya Vedika is ready to contest from Banswada of Nizamabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X