వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేట కొడవళ్లతో నరికి టిడిపి నేత సహా ముగ్గురి హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantapur District
అనంతపురం: జిల్లాలో మరోసారి ఫ్యాక్షనిజం పడగ విప్పింది. అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలం మామిళ్లపల్లి గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకున్ని పాతకక్షల కారణంగా ప్రత్యర్థులు అంతమొందించారు. ఓ మహిళ సహా ముగ్గురుని దారుణంగా హత్య చేశారు. కామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు బోయ నర్సింహులు తన కూతురు పద్మావతి, మరో కుటుంబ సభ్యుడు ఆంజనేయులుతో పాటు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మామిళ్లపల్లి నుండి వెళుతుండగా సుమోపై వచ్చిన దుండగులు వారి వాహనాన్ని గుద్దారు.

ద్విచక్ర వాహనం పైనున్న ముగ్గురు ఎగిరి కింద పడ్డారు. సుమోలోని వ్యక్తులు వచ్చి వారిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. ఈ సంఘటన ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో గ్రామంలో విషాద వాతావరణం ఏర్పడింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఎవరు చంపారో, ఎందుకు చంపారో పూర్తి కారణాలు తెలియరాలేదు.

English summary
Faction murders took place in Anantapur district today. Opposes attacked with knifes and killed three members who is related to Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X