టిటిడిపికి సమ్మె షాక్, జెఏసికి రేవంత్ రాజీనామా లేఖ

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందుకు రేవంత్ రెడ్డి తాను ఎప్పుడో రాజీనామా చేశానని దానిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించలేదన్నారు. మీరే ఆమోదింప చేయండని తన రాజీనామా లేఖను ఐకాస నేతలకు ఇచ్చారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా పార్లమెంటులో ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు గుర్తుంచుకోవాలని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ శుక్రవారం అన్నారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. సంకుచిత భావంతో ఆలోచించడం సరికాదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఇదే ఆఖరి విమోచన దినం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications