టిటిడిపికి సమ్మె షాక్, జెఏసికి రేవంత్ రాజీనామా లేఖ

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందుకు రేవంత్ రెడ్డి తాను ఎప్పుడో రాజీనామా చేశానని దానిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించలేదన్నారు. మీరే ఆమోదింప చేయండని తన రాజీనామా లేఖను ఐకాస నేతలకు ఇచ్చారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా పార్లమెంటులో ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు గుర్తుంచుకోవాలని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ శుక్రవారం అన్నారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. సంకుచిత భావంతో ఆలోచించడం సరికాదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఇదే ఆఖరి విమోచన దినం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications