వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకు లాకర్లలో గాలి వర్గానికి కిలోల కొద్ది బంగారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు: ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ రెడ్డి బ్యాంకు లాకర్లలో సిబిఐ అధికారులు కిలోల కొద్ది బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండున్నర కోట్లరూపాయల నగదు, సుమారు పద్నాలుగు కిలోల బంగారం, వజ్రాలు తదితరాలు సిబిఐ కనుగొన్నట్లుగా తెలుస్తోంది. బళ్లారిలోని యాక్సిస్ బ్యాంకు లాకర్లలో శ్రీనివాస్ రెడ్డి సొత్తు దాచుకున్నారట. ఇప్పటిదాకా బయటపడింది కొంతే. మరెంతో బయట పడాల్సి ఉందట. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయల డబ్బును గాలి ముఠా ఎక్కడెక్కడ దాచిందన్న దాన్ని కనుగొనే పనిలో నిమగ్నమైన సిబిఐ అధికారులు శ్రీనివాస రెడ్డిని తమతోపాటు బళ్లారికి తీసుకెళ్లారు.

యాక్సిస్ బ్యాంకులో ఆయన కుటుంబ సభ్యులకు పది లాకర్లు ఉన్నాయి. వీటిలో ఐదింటిని మాత్రమే అధికారులు తెరిచారు. మరిన్ని బ్యాంకుల్లోని లాకర్లనూ తెరిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేవలం గాలి శ్రీనివాస్ రెడ్డి లాకర్లలోనే ఇంత బంగారం, డబ్బు ఉండటాన్ని చూసి సిబిఐ అధికారులే ఆశ్యర్యపోయారట. శనివారం ఉధయం పదిగంటల ప్రాంతంలో బళ్లారిలోని యాక్సిస్ బ్యాంకుకు చేరుకొని బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి బంగారం, డబ్బులు కనుగొన్నారు. అంతేకాకుండా డ్రైవర్ దగ్గర గాలికి సంబంధించిన పలు భూముల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

English summary
Former Karnataka minister Gali Janardhan Reddy and his company have kgs of gold and crores of cash in bank lockers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X