హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెలాఖరులోగా తేల్చాల్సిందే: తెలంగాణ మంత్రుల లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా ఈ నెలాఖరులోగా ప్రకటన చేయాలని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. తాజా పరిస్థితిని వివరిస్తూ వారు సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. తెలంగాణ మంత్రులు బుధవారం సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. సమావేశానంతరం మంత్రి జానా రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ తర్వాత తాము ఢిల్లీకి వెళ్లి కాంగ్రెసు అధిష్టానం నేతలను కలుస్తామని ఆయన చెప్పారు.

సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నవారే అంతా చేస్తున్నారని అనుకోవద్దని, తాము వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామని, కేవలం ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొనడం వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెను ప్రశాంతంగా నడపాలని ఆయన కోరారు. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా సమావేశమై తాజా పరిణామాలపై సమీక్ష చేశారు. తెలంగాణ మంత్రులు సుదర్శన్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.

English summary
Telangana ministers urged Sonia gandhi to solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X