హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం చస్తాం అవసరమైతే కూలుస్తాం: కాంగ్రెసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao-Ponnam Prabhakar
హైదరాబాద్: సకల జనుల సమ్మెలో భాగంగా శుక్రవారం గన్ పార్కు వద్ద తెలంగాణ ఉపాధ్యాయుల నిరసనలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ నేతలు ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తామన్న హెచ్చరికలు ప్రభుత్వానికి పంపించారు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే చచ్చిపోతానని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు అన్నారు. తెలంగాణ రాకుంటే తాను చచ్పిపోతానన్నారు. జీవితంలో రాజీలేని పోరాటం చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ పదవిని చెత్తబుట్టలో వేశానని చెప్పారు. సకల జనుల సమ్మెతో తెలంగాణ సాధిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమ్మెలతో తెలంగాణ రాదని హెచ్చరిస్తున్నారని అయితే ఎలా రాదో మేమూ చూస్తామన్నారు. ఐక్యతతోనే తెలంగాణ సాధ్యమని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ కోసం తాము ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హెచ్చరించారు. పదవి ఎలా తెచ్చుకున్నారని అడిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆగ్రహం వచ్చిందని ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయించే బాధ్యత మంత్రుల పైనే ఉందన్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పామని ఒకవేళ తెలంగాణ తేకుంటే చచ్చేది కూడా తామే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం పాల్గొన్నారు.

English summary
Congress Party senior MP K Keshav Rao said today that he will die for Telangana. Former Minister Damodar Reddy said they are ready to withdraw to government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X