వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం ఇక మిలిటెంట్ ఉద్యమం: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ ప్రజలంతా ఇక మిలిటెంట్ తరహా ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం శుక్రవారం పిలుపునిచ్చారు. నాంపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో కోదండరామ్ మాట్లాడుతూ జెఏసి సమావేశమై ఒకటి రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పారు. 48 గంటల రైలు రోకోను విజయవంతం చేసి తెలంగాణ సత్తా చాటాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి బాగా లేకున్నప్పటికీ ప్రభుత్వం మొండితనంతో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలని చూస్తోందన్నారు. పరీక్షలకు ఇది సమయం కాదన్నారు. ప్రభుత్వం మొండితనంతో పోయి పరీక్షలు నిర్వహించాలని చూస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం, ఎపిపిఎస్సీ బాధ్యత వహించాలన్నారు. మొండితనంతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దన్నారు.

కాగా మిలిటెంట్ తరహా ఉద్యమంపై కోదండరామ్ అనంతరం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. మిలిటెంట్ తరహా పోరాటం అంటే హింసాయుతం కాదని అహింసాయుతంగానే మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో నాడు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం తరహా భారీ ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అహింసాయుతంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడమని చెప్పారు.

English summary
Telangana JAC chairman Kodandaram called people like millitant movement for Telangana. He appealed public that success rail rokho.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X