వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులపై నాగం, కెసిఆర్‌పై దేవేందర్ గౌడ్ ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy and Devendar Goud
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు మరో దేశంలో ఉండి ఉంటే వారిని అక్కడ ఉరి తీసి ఉండే వారని తెలంగాణ నగారా సమితి చైర్మన్, నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం నాంపల్లిలో జరిగిన ఓ తెలంగాణ సభలో అన్నారు. మంత్రులు ఇప్పటికైనా తమ డ్రామాలు ఆపి రాజీనామా చేస్తే బావుంటుందన్నారు. వారు వెంటనే రాజీనామాలు చేసి గవర్నర్‌చే ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ వారు రాజీనామాలు సమర్పించక పోతే ప్రజలు రాజకీయంగా వారిని ఉరితీసే పరిస్థితి వస్తుందన్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై గౌడ సంఘ సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మెకు మద్దతుగా టిడిపి చేపట్టిన దీక్షలపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ పోరుకు మద్దతు ఇస్తున్న వారిపై దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. కెసిఆర్ అత్యంత ప్రమాదకారి అని, ఆయన ఓ విష పురుగు అని విమర్శించారు. ఆయన పట్ల తెలంగాణ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక నుండి టిడిపి నేతలం గ్రామాల్లో పర్యటిద్దాం, ఎవరు అడ్డుకుంటారో చూద్దామన్నారు.

English summary
Telangana Nagara Samith chairman Nagam Janardhan Reddy fired at T-Ministers today. He demanded them to resign. TDP senior leader Devendar Goud lashes out at TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X