గ్యాస్ ఇవ్వొద్దని జైపాల్ రెడ్డికి చెప్పొచ్చారు: ముఖ్యమంత్రి
తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని, రెండు మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఇది వరకే చెప్పిందని ఆయన అన్నారు. సమ్మె వల్ల ఆర్టీసికి ఎంతో నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఏదైనా చేస్తే ప్రజలకు మేలు కలగాలని, అన్యాయం చేస్తున్నవారిని ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన చెప్పారు. రూపాయికి కిలో బియ్యం పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడు నెలల క్రితమే అంగీకరించినట్లు ఆయన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాకు 15 రోజుల క్రితమే 80 క్వింటాళ్ల విత్తనాలు పంపామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాసిన లేఖకు ఇచ్చిన సమాధానంలో ఆయన చెప్పారు. సమ్మె విరమించాలని ఆయన కోరారు.