హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంకరరావు మాటలు పెట్రోలులా మండుతున్నాయి: జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు ఏం మాట్లాడిన పెట్రోలులాగా భగ్గున మండుతోందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. శంకర్ రావు చేసిన ఆరోపణలు తనపై వస్తే తాను రాజీనామా చేసే వాణ్ణని అన్నారు. మంత్రుల సిబిఐ విచారణ హైకోర్టు పరిధిలోకి వస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి బాగానే ఉందన్నారు. అయితే అందరి ముందున్న అసలైన సమస్య తెలంగాణ భూతమే అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందు తెలంగాణ భూతమే ఉందన్నారు.

అందుకే ఆయన ఇతర సమస్యల పైన దృష్టి సారించలేక పోతున్నట్టుగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యపై కేంద్రం వెంటనే పరిష్కారం చూపించాలని కోరారు. ముఖ్యమంత్రి సైతం ఈ సమస్యపై మౌనం వహించకుండా త్వరగా పరిష్కారం చూపించాల్సిందిగా కేంద్రానికి సూచించాలన్నారు. లేదంటే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. మంత్రులు వీధి పోరాటాలు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రోడ్డెక్కి ప్రజా పోరాటం అంటూ చెప్పడం సరికాదన్నారు.

English summary
Former minister JC Diwakar Reddy said today that minister Shankar Rao allegations are heating that state. He appealed central govern me that to solve Telangana issue soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X