తెలంగాణ: శ్రీకృష్ణ కమిటీనే ఫాలో అయిన ఆజాద్?
కమిటీ ప్రతిపాదించిన ఆరో ప్రతిపాదనకు కాస్త మెరుగులు దిద్ది నివేదిక రూపొందించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాన్ని విడగొట్టకుండా సమైక్యాంగానే ఉంచి వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయాలని ఆయన అందులో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది. మూడు ప్రాంతాలకు వేరువేరుగా సహాయం ప్రకటించాలని, తెలంగాణ ఉద్యమం, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాన్ని ఎప్పటికీ సమైక్యంగా ఉంచకుండా భవిష్యత్తులో విభజించాలని కానీ ఇప్పటికిప్పుడు ఏం చేసినా ఇరు ప్రాంతాలలో భావోద్వేగాలు ఉబికి వస్తాయని ఆయన సూచించారని సమాచారం. ఇందుకోసం మధ్యేమార్గంగా ఆర్థిక మండళ్లు ఉత్తమమైన పరిష్కారమని అ తర్వాతా ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరుపుకుంటూ వెళ్లి ఏకాభిప్రాయం వచ్చాక విభజించాలని అందులో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది.