హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్‌తో త్వరలో ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
హైదరాబాద్: తెలంగాణ అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు త్వరలో కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఆరు విద్యార్థి సంఘాలతో కూడిన ఒయు జెఎసి ప్రతినిధులు రాహుల్ గాంధీని ఈ నెలలో కలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు సెప్టెంబర్ 28వ తేదీన రాహుల్ గాంధీతో మాట్లాడి ఆయన ఆపాయింట్‌మెంట్ కోరారు. భేటీకి తేదీని, సమయాన్ని త్వరలో నిర్ణయిస్తారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులే కాకుండా తెలంగాణలోని ఇతర విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా రాహుల్ గాంధీని కలిసే ప్రతినిధి బృందంలో ఉంటారు. ఢిల్లీ, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని తెలంగాణ విద్యార్థులు కూడా ఆయనను ఈ నెలలో కలుస్తారు. తెలంగాణ అంశాన్ని రాహుల్ గాంధీకి వివరించాలనే ఉద్దేశంతోనే ఈ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

English summary
Students of Osmania University are planning to meet AICC general secretary Rahul Gandhi on the separate Telangana state issue soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X