వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేరవేస్తున్నందునే సెక్యూరిటీ వద్దన్నా: శంకర్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: మంత్రి శంకర్ రావు తనకు అదనపు సెక్యూరిటీ ఎందుకు వద్దన్నారో ఆదివారం చెప్పారు. తన వద్ద ఉన్న గన్ మెన్‌లు తన ప్రతి కదలికను, తనకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు ఆదివారం ఆరోపించారు. అందుకే తనకు సెక్యూరిటీ సిబ్బంది వద్దని చెబుతున్నానన్నారు. తన ఫోన్లు ట్యాపింగుకు గురవుతున్నాయన్నారు. తనకు రక్షణగా తానే ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటానని చెప్పారు.

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన తన జీతంలోని యాభై వేల రూపాయలతో దుప్పట్లు కొని బన్సీలాల్ పేటలోని సేవాశ్రమంలో వికలాంగులకు పంపిణీ చేశారు. వృద్ధులు, అనాధలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు గతంలో తాను చెప్పినట్లుగా ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. కాగా ఇటీవల డిజిపి దినేష్ రెడ్డికి లేఖ రాస్తూ తనకు అదనపు సెక్యూరిటీ వద్దని అందుకు కారణం త్వరలో చెబుతానని లేఖ రాసిన విషయం తెలిసిందే.

English summary
Minister Shankar Rao clarified today on his security reject in media conference. He distributed blankets to poor people with his salary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X