ఇంటెల్ ల్యాప్ టాప్స్ దానం అలా ఉపయోగం..!!
కేరళ గవర్నమెంట్ ఐటి దిగ్గజం ఇంటెల్తో భాగస్వామ్యంతో ఆయా జిల్లాల్లో తలపెట్టిన స్మార్ట్ స్కూల్ ప్రాజెక్టు(ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్)లు విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. దేశం మొత్తం మీద మొట్టమొదటి సారి ఈ ఐటి@స్కూల్ ప్రాజెక్టుని ప్రారంభించిన రాష్ట్రంగా కేరళ చరిత్రకెక్కింది. ఈ మహాత్తర కార్యక్రమాన్ని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ ఛాందీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇలాంటి ఐటి@స్కూల్ ప్రాజెక్టులకు కేరళ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని తెలిపారు.
ఈ ఐటి@స్కూల్ ప్రాజెక్టు కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం స్టూడెంట్స్తో పాటు టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని ద్వారా సంవత్సరానికి రెండు లక్షల టీచర్స్తో పాటు, ఐదు మిలియన్ స్టూడెంట్స్ లభ్ది పోందనున్నారని తెలిపారు. ఈ సందర్బంలో ఐటి@స్కూల్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్వర్ సాధా మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్లలో మొబైల్ కంప్యూటింగ్ కూడా ముఖ్య పాత్రని పోషిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్కి, టీచర్స్కి కొంత కాలం వరకు ల్యాప్ టాప్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. స్టూడెంట్స్ వాటిని ఇళ్లకు కూడా తీసుకొవి వెళ్లేటటువంటి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. దీంతో స్టూడెంట్స్ వీటిని ఎక్కవ సేపు ఉపయోగించడమే కాకుండా ఐటి@స్కూల్ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని విషయాలను ఈజీగా తెలుసుకొవచ్చన్నారు.