వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోశయ్యతో కెసిఆర్ భేటీ చివరి నిమిషంలో రద్దు
కాగా, తెలంగాణకు సంబంధించిన తమ వ్యూహం తమకు ఉంటుందని కెసిఆర్ అన్నారు. తెలంగాణ జెఎసి సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల పట్ల అనుసరించాల్సిన వ్యూహాన్ని రేపటి తెలంగాణ జెఎసి విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. కెసిఆర్ ఈ నెల 11వ తే్దీన ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీలతో భేటీ కావాలనేది ఆయన ఉద్దేశ్యం. కెసిఆర్ ఢిల్లీ యాత్ర తర్వాతనే రైలో రోకో నిర్వహించాలనే అంశం శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
k chandrsekhar rao telangana rastra samithi rosaiah tamilnadu governor కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి రోశయ్య తమిళనాడు గవర్నర్
English summary
TRS president K Chandrasekhar Reddy proposed meeting with Tamilnadu governor Rosaiah.
Story first published: Friday, October 7, 2011, 18:42 [IST]