తెలంగాణ రైల్ రోకో వాయిదా, తేదీల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పోలీసులు రెచ్చగొట్టినా తమ ఉద్యమం శాంతియుతంగా సాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి 1350 మెగావాట్ల విద్యుత్తు ఇస్తామని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, దాన్ని సరిగా పంపిణీ చేస్తే రైతులకు ఏడు గంటలు విద్యుత్తు అందించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. పది, పదిహేను రోజుల్లో రైతుల పంటలు చేతికి వస్తాయని, అంత వరకు ఏడు గంటలు రైతులకు విద్యుత్తు అందించాలని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికులకు వేతనాలు ఇస్తామని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని, మళ్లీ బొత్సతో మాట్లాడుతామని ఆయన అన్నారు.
సమ్మె విరమించి విధుల్లో చేరినవారికి మాత్రమే అడ్వాన్సులు చెల్లిస్తామని అంతకు ముందు ఆర్టీసి ఎండి ప్రసాదరావు చెప్పారు. ఆర్టీసిని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో కార్మికులు సమ్మె చేయడం సరి కాదని, వారు పునరాలోచన చేసుకోవడం మంచిదని ఆయన అన్నారు. ఆర్టీసికి ఇప్పటికే 140 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.