వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండెలపై తుపాకి పెట్టి చర్చలా: మోత్కుపల్లి నర్సింహులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothkupally Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ పట్ల కాంగ్రెసు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా ధ్వజమెత్తారు. గుండెలపై తుపాకి పెట్టి సమ్మె చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను చర్చలకు పిలుస్తారా అంటూ ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ పట్ల అనుసరిస్తున్న వైఖరికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను తీరును ఆయన వ్యతిరేకించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రైలో రోకోలో పాల్గొనడం కన్నా తమ పదవులకు రాజీనామా చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అది కోర్ కమిటీ కాదు, బోర్ కమిటీ అని ఆయన కాంగ్రెసు కోర్ కమిటీ గురించి వ్యాఖ్యానించారు. కాంగ్రెసు కోర్ కమిటీ తెలంగాణపై చర్చించడం లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారంపై చర్చలు జరపకుండా టీ, టిఫిన్లతోనే కోర్ కమిటీ సరిపుచ్చుతోందని ఆయన అన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల వల్లనే తెలంగాణ వస్తుందనే భావన తెలంగాణ ప్రజల్లో బలపడుతోందని ఆయన అన్నారు.

English summary
TDP Telangana region MLA Mothkupally Narasimhulu has lashed out at Congress core committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X