హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌పై తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బూట్లూ పాలిష్ చేస్తున్నారన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలపై ఆ ప్రాంత కాంగ్రెసు శాసనసభ్యులు రాజిరెడ్డి, భిక్షపతి, సుధీర్ రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేం ఎవరి బూట్లూ పాలిష్ చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు లొంగి తాము ఇలాంటి ప్రకటనలు చేస్తున్నామనుకోవడం అవివేకమన్నారు. తామంతా తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ కోసం మరోసారి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యమంలో భాగంగా అమాయకులపై కేసు పెడితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తెస్తామన్నారు.

హైదరాబాదు తెలంగాణలో భాగమన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సకల జనుల సమ్మె నుండి విద్యాసంస్థలను మినహాయించాలని వారు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిని విజ్ఞప్తి చేశారు. తాము సమ్మెకు మద్దతు పలుకుతున్నామని అయితే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి విద్యా సంస్థలకు మినహాయింపును కోరుతున్నట్లు చెప్పారు.

English summary
Telangana Congress MLAs Raji Reddy, Bikshapathi and Sudheer Reddy fired at TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X