హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ వచ్చే సమస్యే లేదు: వీరశివా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్/విశాఖపట్నం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే సమస్యే లేదని కడప జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వీరశివా రెడ్డి శుక్రవారం అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులమంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయని తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు సైతం సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు. పలువురు శాసనసభ్యులు తెలంగాణ కోసం మనస్ఫూర్తిగా రాజీనామా చేయలేదన్నారు. వారిచే బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

కాగా విశాఖపట్నంలో సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమైక్యమా? ప్రత్యేకమా? అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో ప్రత్యేక తెలంగాణ ఎందుకు వద్దు, సమైక్యాంధ్ర ఎందుకు ఉండాలి అనే అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి పలు పరిష్కార మార్గాలు సూచించారు. ఈ పుస్తకం విడుదల కార్యక్రమంలో సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి నేత కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

English summary
MLA Veerashiva Reddy said today that Telangana will not come. He said some of Telangana leaders also supporting Samaikyandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X