తాగి విద్యార్థులపై దాడి చేసిన హీరో నవదీప్, కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నవదీప్పై బంజారాహిల్సు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నవదీప్ నోవాటెల్ హోటల్లో తాగిన మైకంలో ఇంజనీరింగ్ విద్యార్థులపై దాడి చేశారు. అమ్మాయిలతో కలిసి నవదీప్ వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నవదీప్తో పాటు మరో ఇద్దరి పైనా కేసు నమోదు చేశారు. కేసును మాదాపూర్ నుండి జూబ్లీహిల్స్ పిఎస్కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు చెప్పారు.
అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో హోటల్లోని ఐస్ క్రీం పార్లర్ వద్ద ఐస్ క్రీం తింటున్న విద్యార్థుల వద్దకు ఓ అమ్మాయితో పాటు వెళ్లి దాడి చేశాడు. వారి చేతులో ఉన్న సెల్ ఫోన్లు ధ్వంసం చేశాడు. పిఎస్లో నేను ఏం చెప్పినా చెల్లుతుందని, పోలీసులు తన వాళ్లే అని చెబుతూ తమపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.