కెసిఆర్, కోదండరామ్లకు ఎమ్మార్పీయస్ సెగ
ఎమ్మార్పీయస్ కార్యకర్తల తీరును ఆమె తప్పు పట్టారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం సమావేశం నిర్వహించిన కార్యాలయం ఎదుటే ధర్నాకు దిగుతారా అని ఆమె ప్రశ్నించారు. తాము సామాజిక తెలంగాణ కోసమే పోరాడుతున్నామని, దాని కోసం ప్రభుత్వంతో పోరాడాలి గానీ ఇక్కడ ధర్నా చేయడమేమిటని ఆమె అన్నారు. సామాజిక తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై పోరాటం చేయాలని ఆమె సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము పోరాడుతామని ఆమె అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని, జానా రెడ్డిని, తదితర అగ్రవర్ణాలవారిని ప్రశ్నించకుండా తమ కార్యాలయం ముందు ధర్నా చేయడం సరి కాదని ఆమె అన్నారు. తెలంగాణ అన్ని కులాల వారు పోరాడుతున్నారని, ఈ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలో భాగంగా ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణ మాదిగ వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. రేపటి నుంచి పాఠశాలలను తెరుస్తామని చెప్పినా ఎమ్మార్పీయస్ కార్యకర్తల ద్వారా మందకృష్ణ ధర్నా చేయిస్తున్నారని న్యూడెమొక్రసీ నాయకులు అన్నారు.