హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య ఎమ్మెల్సీ స్థానం కోసం కోటగిరి ప్రయత్నాలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kotagiri Vidyadhar Rao
హైదరాబాద్: ఇటీవల ఖాళీ అయిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధర రావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా వెళ్లడంతో ఆయన శాసనమండలి స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు కాంగ్రెసులోని పలువురు నేతలు రోశయ్య స్థానంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కోటగిరి కూడా తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి ఆ స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లుగా తెలుస్తోంది.

కాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం కోసం ఈ నెల 24వ తేదికి నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో పలువురు కాంగ్రెసు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. రోశయ్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆ వర్గానికి చెందిన నేతలు, ఆంధ్రా ప్రాంతం నేత కాబట్టి ఆ ప్రాంతం నేతలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణకు చెందిన నేతలు ఇలా ఆ సీటుపై పలువురు ఆశలు పెట్టుకున్నట్లుగా సమాచారం.

English summary
Former minister Kotagiri Vidyadhara Rao met PCC chief Botsa Satyanarayana yesterday for MLC seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X