వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరమైతే బిజెపితోనైనా పనిచేస్తాం: మధు యాష్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: తెలంగాణ కోసం అవసరమైతే బిజెపితోనైనా కలిసి పనిచేస్తామని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ పోరాటం విషయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పినా మరెవరు చెప్పినా వినేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అందరినీ కలుపుకుని తాము ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీవారిని కూడా కలుపుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

ఏ జెఎసి అయినా తెలంగాణ కోసమే పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు జెఎసి అయినా, తెలుగుదేశం జెఎసి అయినా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జెఎసి అయినా తెలంగాణ కోసమే పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే జెఎసిలు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. తమకు రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని, అందుకు ఏ ఉద్యమ ప్రక్రియనైనా చేపడుతామని ఆయన అన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందని భావిస్తే రాజీనామాలు చేస్తామని ఆయన అన్నారు.

English summary
Congress Telangana MP Madhu Yashki said that they will work with BJP for Telangana, if needed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X