గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో అపశృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో మంగళవారం అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో జగన్ మాట్లాడుతున్న సమయంలో ఆయనను చూడటానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. చుట్టు పక్కల గ్రామాల నుండి చాలా మంది తరలి వచ్చారు. దీంతో ఇంటి గోడల పైకి ఎక్కి జగన్‌ను చూసే ప్రయత్నాలు చేశారు. కొందరు అక్కడే ఉన్న అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉన్న రేకుల షెడ్డు ఎక్కారు. బలంగా లేని షెడ్డు కూలింది. దీంతో నలుగురు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక హాస్పిటల్ తరలించి చికిత్స చేయించారు.

కాగా ఇటీవలె కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రను పూర్తి చేసిన వైయస్ జగన్ ఆదివారం గుంటూరు జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. జగన్ తన ఓదార్పు యాత్రలో 25 కుటుంబాలను పరామర్శించి 700కు పైగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించనున్నారు.

English summary
Small accident occurred in YSRC Party president YS Jaganmohan Reddy's odarpu yatra today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X