తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతిలో తెలంగాణవారికి సమైక్యవాదుల సన్మానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి/విశాఖపట్నం: సమైక్య రాష్ట్రం కోసం చిత్తూరు జిల్లాలో సమైక్యవాదులు మంగళవారం వినూత్న నిరసన తెలిపారు. తెలంగాణ ప్రాంతం నుండి వెళ్లిన బస్సులను వారు శుభ్రం చేసి వాహనాలకు పూజలు చేసి డ్రైవర్లకు సన్మానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రానికి మద్దతు పలకాలని వారు తెలంగాణ నుండి వెళ్లిన వారిని కోరారు. కాగా విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం జిల్లాలలో సమైక్యవాదులు ఆందోళన చేశారు. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని డిమాండ్ చేశారు.

సమైక్య రాష్ట్రానికి పలుకుతూ ప్రభుత్వానికి అండగా ఉండేందుకు మంగళవారం నుండి ఒక గంట పాటు విధులు అదనంగా నిర్వర్తిస్తామని ఉద్యోగులు ప్రకటించారు. మరోవైపు విశాఖలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండుతో సమైక్యాంధ్ర ప్రజా పోరాట సమితి భేటీ నిర్వహించింది. ఈ సమావేశానికి పెందుర్తి శాసనసభ్యుడు రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని ప్రకటన చేయకపోతే దీక్షకు దిగుతామని వారు కేంద్రాన్ని హెచ్చరించారు.

English summary
Samaikyandhra activists cleaned Telangana vehicles and honored drivers in Chittoor district to support United Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X