వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధికతో కుమారస్వామి రెండో పెళ్లి: హైకోర్టులో వ్యాజ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kumaraswamy
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో పెళ్లి చేసుకున్నారని, భారతీయ శిక్షాస్మృతి 494 ప్రకారం భార్య జీవించి ఉండగా మరో వివాహం చేసుకోవడం నేరమని ప్రముఖ న్యాయవాది శశిధర్ బెళగుంప హైకోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్రస్తుతం లోకసభ సభ్యునిగా ఉన్న కుమారస్వామి రెండో వివాహం చేసుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని ఆయన పిల్‌లో పేర్కొన్నారు. వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించినట్లుగా సమాచారం. దీనిపై గురువారం విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాగా మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి మొదటి భార్య అనిత. ఆమె ప్రస్తుతం మధుగిరి నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ఉన్నారు. వీరికి నిఖిల్ గౌడ్ అనే కుమారుడు ఉన్నారు. కుమారస్వామి సిఎంగా ఉన్న సమయంలో రాధికను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు, వీరికి షమిక అనే పాప ఉందని ప్రచారం. కుమారస్వామితో వివాహం తర్వాత ఆమె తన నివాసాన్ని బెంగళూరు నుంచి మార్చారట.

English summary
A City-based advocate has filed a writ petition before the High Court against former chief minister H D Kumaraswamy for his alleged second marriage and seeking a direction to the Lok Sabha Speaker to disqualify the JD(S) leader from the membership of Parliament on this count.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X