ఎమ్మెల్సీ స్థానం: చిరంజీవితో బొత్స సత్యనారాయణ భేటీ
ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయ్యాక చిరు తరఫు నేతలకు ఎలాంటి పదవీ దక్కలేదు. చిరంజీవికి సైతం పదవులు వరిస్తాయని వాదనలు వినిపించడమే తప్ప ఇప్పటి వరకు ఆయనకు ఏ పదవీ రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు ఖాళీ కావడంతో పలువురు నేతలు దానిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం నుండి వచ్చిన వారు ప్రధానంగా ఈ సీటుపై కన్నేశారు. ఈ నేపథ్యంలో బొత్స చిరుతో భేటీ కావడం ప్రాధావ్యత సంతరించుకుంది. కోటగిరి విద్యాధర రావు తదితరులు ఎమ్మెల్సీ స్థానం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆర్య వైశ్య నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వైశ్యులకే ఆ స్థానం కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే.
Comments
botsa satyanarayana chiranjeevi kotagiri vidyadhar rao mlc hyderabad బొత్స సత్యనారాయణ చిరంజీవి కోటగిరి విద్యాధర రావు ఎమ్మెల్సీ హైదరాబాద్
English summary
PCC chief Botsa Satyanarayana met with Tirupati MLC Chiranjeevi today and talk about present political situations and MLC seat.
Story first published: Thursday, October 20, 2011, 14:08 [IST]