మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నాటకలో ఘోర ప్రమాదం: 5గురు ఆంధ్రుల మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Medak District
మెదక్: కర్నాటకలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మన రాష్ట్రానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. కర్నాటకలోని ధర్మస్థలిలోని మంజూనాథ స్వామిని దర్శించుకోవడానికి మెదక్ జిల్లాకు చెందిన నారాయణ ఖేడ్ మండలానికి చెందిన వెంకటాపూర్ వాసులు గురువారం వెళ్లారు. శుక్రవారం ధర్మస్థలికి కారులో వెళుతుండగా యాదగిరి మండలం షాపూర్ వద్ద నారాయణపురం ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

వీరు వెంకటాపూర్‌కు చెందిన ప్రకాశ్ కుటుంబీకులు. ఈ ప్రమాదంలో ప్రకాశ్, జ్యోతి, రామారావు, లలిత, మరొకరు మృతి చెందారు. ప్రకాశ్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. అతను జ్యోతిష్యుడిగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన అందరికీ సుపరిచితుడు. ప్రకాశ్ ఆయన కుటుంబం ప్రమాదంలో మరణించిందని తెలియడంతో సొంత గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

English summary
Five Andhra Pradesh people died in Karnataka road accident. All the victim people are belongs to Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X