గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేనొస్తున్నానని ధర పెంచారు: వైయస్ జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: తాను పసుపు రైతులను పరామర్శించడానికి వస్తున్నాననే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పసుపుకు రూ. వెయ్యి పెంచిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో అన్నారు. జిల్లాలో జరుగుతున్న ఓదార్పులో భాగంగా ఆయన దుగ్గిరాల పసుపు యార్డును సందర్శించారు. రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు వారి గోడును వెళ్లబోసుకున్నారు. జగన్ మాట్లాడుతూ గురువారం పసుపు ధర మార్కెట్లో తక్కువకు కొనుగోలు చేసి ఈ రోజు తానొస్తున్నాని వెయ్యి పెంచారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ధర రూ.16వేలు ఉండగా ఇప్పుడు ఐదు వేల రూపాయలు కూడా లేదన్నారు.

ఇలా అయితే రైతులు పసుపు పండించలేని స్థితికి చేరుకుంటారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రామాలలో పర్యటించాలన్నారు. క్వింటాలుకు రూ.9 నుండి పది వేల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎరువల ధరలు తగ్గించాలని కోరారు. రైతులకు చాలినంత విద్యుత్ ఇవ్వాలన్నారు. రైతుల తరఫున పోరాడటానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy blamed state government for their attitude against farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X