రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగులకు జగన్ వర్గం ఎమ్మెల్యే భార్య టోకరా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

East Godavari District
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోసు సతీమణి తమను ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందినట్లుగా సమాచారం. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే సతీమణి తమ వద్ద లక్షల రూపాయలు తీసుకున్నారని ఇద్దరు యువకులు ఎస్పీకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తమతో పాటు మరికొందరు కూడా ఉద్యోగాల పేరుతో మోసపోయినట్లుగా వారు ఫిర్యాదు చేశారట.

జిల్లాలోని కె.గంగవరం మండలం పేకేరుకు చెందిన సుబ్బారావు, వెలంపాలెంకు చెందిన రమేష్ అనే యువకులు బోసు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హాస్టల్ వార్డెన్ పోస్టులిప్పిస్తామని ఆయన సతీమణి ఓ ప్రభుత్వం పాఠశాలలో అటెండరుగా పని చేస్తున్న రామ్మూర్తి అనే వ్యక్తి ద్వారా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించినట్లుగా సమాచారం.

English summary
The allegations revealed that two young complained to district SP against YSRC Party president YS Jaganmohan Reddy camp MLA Pilli Subash Chandra Bose's wife for cheating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X