కేంద్రం నుండి స్పందన లేదే, ఐనా..!: కెసిఆర్
ఇక నుండి ఉద్యమం చేయాల్సిన తీరుపై వారితో చర్చించారు. కేంద్రం ఇప్పటికే స్పందించాల్సి ఉండాల్సింది. కానీ హైదరాబాద్ పైనే ఆగినట్లుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదన్నారు. సంయుక్త రాజధానిగా ప్రకటిస్తే ఐదు, పదేళ్ల వరకైతే మనకు అభ్యంతరం ఉండదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చలో హైదరాబాద్ వంటి ప్రత్యామ్నాయ కార్యక్రమాలతో వెళితే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే రాజకీయ కార్యక్రమాలు అయితేనే బెటర్ అని, పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఉద్యమిద్దామని సూచించారు.
ప్రభుత్వంతో చర్చల విషయంలో క్షేత్రస్థాయిలోని పరిస్థితులను బట్టి నడుచుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. మొత్తం మీద ఇకపై ఉద్యోగుల సాయంతో కాకుండా రాజకీయంగానే యుద్ధం చేయాలని, ప్రత్యేకించి కాంగ్రెస్నే లక్ష్యంగా చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె కన్నా ఉద్యోగులు చేయగలిగిన పెద్ద ఉద్యమం ఏముండదని అయినా ప్రభుత్వం స్పందించడం లేదని అయినప్పటికీ కేంద్రం స్పందిస్తుంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.