హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో ముగ్గురు టెక్కీలు సహా 4గురు దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
హైదరాబాద్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగువాళ్లు దుర్మరణం పాలయ్యారు. నలుగురిలో ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వీరు ముగ్గురు కూడా మిరాకిల్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ విద్యార్థి తప్పతాగి రాంగ్ రూటులో వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో తెలుగువాళ్లు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దెబ్బ తిని కాలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. మృతుల్లో వెంకటాచలం, సత్యేంద్ర, సుమంత్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ వెంకటాచలం మామ. తనకు మనవరాలు పుట్టడంతో ఆయన అమెరికాకు వచ్చారు.

రోడ్డు ప్రమాదం డెట్రాయిట్ సమీపంలోని మిషిగన్ లాడ్జ్ ఫ్రీవేపై జరిగినట్లు తెలుస్తోంది. వెంకటాచలం, సత్యేందర్, రాజేంద్రప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడేనికి చెందినవారని సమాచారం. సుమంత్ విశాఖపట్నం జిల్లా రాజన్నపాలెం గ్రామానికి చెందినవారు. వీరు మృతి చెందిన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

English summary
Four Telugu NRI dead in USA in a road accident. Among four three are software engineers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X