వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ పరిష్కారమయ్యేంత వరకు అంతే: నారాయణ
రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ప్రభుత్వం జాప్యం చేయకుండా రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాలయాపన కమిటీలతో ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వేలమంది పోలీసుల భద్రతతో సోంపేట థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అనడాన్ని ప్రస్తావిస్తూ దమ్ముంటే ప్రాజెక్టును కట్టాలని ఆయన సవాల్ చేశారు. కర్నూలులో తమ పార్టీ కార్యకర్తలు చేయి చేసుకున్నారని జిల్లా వైద్యాధికారి కలెక్టర్కు ఫిర్యాదు చేశారని, ఆలాంటిదేమీ జరగలేదని, విజువల్స్ తెప్పించుకుని విచారణ జరిపించాలని, తమ పార్టీ కార్యకర్తలు తప్పు చేశారని తేలితే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.
Comments
English summary
CPI secretary K Narayana saiod that controversy like RDS will take place, till the Telangana issue is solved.
Story first published: Tuesday, October 25, 2011, 17:37 [IST]