వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాదాపూర్‌లో దొంగల బీభత్సం, గోదావరి వాసి హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

hyderabad
హైదరాబాద్: మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో దోపిడీ దొంగలు మంగళవారం ఉదయం బీభత్సం సృష్టించారు. అయ్యప్ప సొసైటీలో ఉంటున్న కె సత్యనారాయణ మూర్తి అనే సివిల్ కాంట్రాక్టు ఇంట్లో తెల్లవారుజామున మూడు గంటలకు దొపిడీ దొంగలు చొరబడ్డారు. ఆయనను తాళ్లతో కట్టేసి దారుణంగా చితకబాదారు. ఇంట్లో ఉన్న నగదు, నగలు దోచుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దీంతో అయ్యప్ప సొసైటీలో విషాదఛాయలు నెలకొన్నాయి.

కె సత్యనారాయణ మూర్తి తూర్పు గోదావరి జిల్లా వాసి. ఆయన ఐదేళ్ల క్రితం హైదరాబాదు వచ్చినట్లుగా తెలుస్తోంది. భర్త మృతదేహం వద్ద ఏడుస్తున్న ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సత్యనారాయణ ఇంట్లో సిసి కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయలేదు. దీంతో దొంగలు ఎవరో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Thieves killed civil contractor K Satyanarayana today at Ayyappa Society of Hyderabad today. He came from west godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X